తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

ఐటిఐ లో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి 

ఐటిఐ లో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి 

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ లలో రెండో విడత ప్రవేశాల కోసం  దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్, మణుగూరు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్  తెలిపారు. మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లోని ఎలక్ట్రిషన్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్, డీజిల్ మెకానిక్ ,కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోప ) కోర్సు లలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. . అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీ లోగా సమీపంలోని ప్రభుత్వ ఐటిఐ లో దరఖాస్తులు ఆన్లైన్ చేసుకోవడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. www. ititelangana. gov.in అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చును. ఇటీవల సప్లమెంటరీలో పదవ తరగతి పాస్ అయిన వారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మొదటి విడత దరఖాస్తు చేసుకొని సీటు రానివారు ఆప్షన్ పెట్టుకోవాలి అని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9440206990కు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *