తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ముక్కోటి ఏకాదశి గోడ పత్రికలను ఆవిష్కరించిన కలెక్టర్ 

ముక్కోటి ఏకాదశి గోడ పత్రికలను  ఆవిష్కరించిన కలెక్టర్ 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ఈనెల 29 ,30 వ తేదీలలో జరిగే ముక్కోటి ఏకాదశి  గోడ పత్రికలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం   జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనంనకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే విధంగా పూర్తి సమాచారం తెలియడానికి గోడపత్రికలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా అంటించడం జరుగుతుందని అన్నారు. అలాగే భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాలు, ఏర్పాట్లపై   15వ  తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్ కలెక్టర్ రేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలోడివిజనల్ లెవెల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనంనకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు కల్పించాల్సిన  వసతి సౌకర్యాలపై సంబంధిత డివిజన్ అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు,అర్చక స్వాములు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *