ఖమ్మంతెలంగాణ

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా  కలెక్టర్ 

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా  కలెక్టర్ 

ఖమ్మం,శోధన న్యూస్: పదో తరగతి పరీక్షల నిర్వహణను ఖమ్మం  జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ శనివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం, త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడ పొరపాట్లకు తావివ్వకుండా నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణ చేయాలన్నారు. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాల రవాణా పోలీస్ ఎస్కార్ట్ తో చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు కేంద్రంలోకి అనుమతించవద్దని, విద్యార్ధులతోపాటు, సిబ్బందిని ప్రిస్కింగ్ చేపట్టి, తనిఖీ తర్వాతనే అనుమతించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *