ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శోధన న్యూస్ : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన నేపద్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు రామవరంలో గల ఎస్ ఆర్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమిగూడవద్దని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. అధికారులు ఎవరైనా సరే పూర్తిగా తనిఖీ చేశాకే కేంద్రం లోపలికి అనుమతించాలని అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి సూచించారు.