తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులదే కీలక పాత్ర

ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులదే కీలక పాత్ర

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :  రానున్న పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులదే కీలక పాత్ర అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకై నియమించిన నోడల్ అధికారులతో సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ హాలు నందు ఎస్ పి రోహిత్ రాజ్ , అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐ టి డి ఏ పి ఓ ప్రతి జైన్ లతో కలిసి సంబంధిత నోడల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ జిల్లా లో నోడల్ అధికారులందరూ వారికి కేటా యించిన అంశాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలని కోరారు. అన్ని విషయాలపై నోడల్ టీములకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని శిక్షణ నోడల్ అధికారి ని ఆదేశించారు. మొదటి ర్యాండైజేషన్ తర్వాత పిఓ, ఏపీఓలకు సైతం శిక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సామాగ్రికి సంబంధించి ఎప్పటికప్పుడు. రాష్ట్రస్థాయి నోడల్ అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఎన్నికల సామాగ్రిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎన్నికల మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి కు ఆదేశించారు. ట్రాన్స్ పోర్ట్ లలో  భాగంగా అవసరమైన వాహనాల ఏర్పాటు, అంతర్రాష్ట సరిహద్దులలో, జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో సిబ్బంది ని ఏర్పాటు చేయాలని, ఇందులో పోలీస్, ఆర్టీవో, ఎక్సైజ్ ఉద్యోగులను నియమించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల యాప్ లతో పాటు, ఎంసీఎంసీ, సి- విజిల్ పై కంప్యూటరైజేషన్ శిక్షణ ఇవ్వాలని, కంప్యూటరైజేషన్ నోడల్ అధికారి కి ఆదేశించారు. పట్టణ స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, ముఖ్యంగా వలస కూలీలు, దివ్యాంగులు, మహిళా కల్పించాలని, ప్రత్యేకించి హోం ఓటింగ్ పై సరైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా స్వీప్ నోడల్ అధికారికి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ ల ఏర్పాటు, సెక్టోరల్ అధికారుల నియామకం, తదితర విషయాలపై దృష్టి సారించాలని ఎస్పి రోహిత్ రాజ్ తో కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 24 గంటలు, 48గంటలు, 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తూ ముందుకువెళ్లాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి నోడల్ అధికారి కి ఆదేశించారు. మీడియా మానిటరింగ్, ఎం సి ఎం సి కమిటీ, మరియు పెయిడ్ న్యూస్ వీటన్నిటి పై సంబంధిత నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయాలి అధికారులను ఆదేశించారు. నోడల్ అధికారులు అందరూ అన్ని నివేదికలను సకాలంలో నిర్దేశించిన ప్రకారం అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో డిఇఓ వెంకటేశ్వర చారి, ఎమ్మే అలీంజిల్లా మార్కెటింగ్ అధికారి, బి. బాబురావు జిల్లా వ్యవసాయ అధికారి, జైపాల్ రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, సుశీల్ కుమార్ డి ఐ ఓ ఎన్ ఐ సి, ప్రసూన రాణి జడ్పీ సీఈవో, సయ్యద్ ఖుర్షిద్ జిల్లా కోపరేటివ్ అధికారి, శ్రీమతి సుమ ఎస్ డి సి కాటన్ పల్లి, చంద్రమౌళి డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ భద్రాచలం, జీ తిరుపతయ్య జిల్లా పరిశ్రమల శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *