తెలంగాణహైదరాబాద్

అసెస్టెంట్ ప్రొఫెసర్,  లెక్చరర్ అర్హత పరీక్ష కు నోటిఫికేషన్ విడుదల 

అసెస్టెంట్ ప్రొఫెసర్,  లెక్చరర్ అర్హత పరీక్ష కు నోటిఫికేషన్ విడుదల 

హైదరాబాద్, శోధన న్యూస్ :  తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ -2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే సెట్ పరీక్ష నోటిఫికేషన్ ను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొపెసర్ మల్లేశ్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లేశం, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి విడుదల చేశారు. ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఆన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు జూలై 2వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో జూలై 26వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20 తేదీ నుంచి వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *