తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్ 

ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ తెలిపారు. మంగళవారం ఎస్పి కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన వివరాలు వెల్లడించారు.  గత సంవత్సరం మే నెలలో భాదితుల ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. 60 మంది అమాయకులైన నిరుద్యోగుల నుండి దాసు హరి కిషన్, గుండా వినోద్ కుమార్, ఉపేంద్ర నాయుడు  అనే వ్యక్తులు  అరెస్ట్ అయిన నిందితురాలు దాసు హారికతో పాటు కొంతమంది కలిసి 2018 సంవత్సరం నుండి సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్, క్లర్క్స్,డిపెండెంట్ జాబ్స్, గ్రూప్-2లో ACTOS, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడ్డారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసిన ఈ నిందితులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సుమారు రూ4,08,00,000 (నాలుగు కోట్ల ఎనిమిది లక్షలు)లు  వసూలు చేసినట్లు తేలింది.ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 మంది నిందితులను గుర్తించి ఇప్పటివరకు పదిమందిని అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

ఈ  కేసులో అరెస్టయిన నిందితుల వద్ద నుండి ఇప్పటివరకు రూ. 1,47,14,000 ల నగదుతో పాటు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్  బైక్ ను స్వాదీనం చేసుకున్నామన్నారు.  మోసం చేసి   సంపాదించిన డబ్బుల ద్వారా నిందితులు కొనుగోలు చేసిన సుమారు 92.5 తులాల బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట్లు నిందితులు తెలిపారన్నారు. వాటిని కూడా వీలైనంత త్వరగా చట్ట ప్రకారం స్వాదిన పరచుకోవడం జరుగుతుందన్నారు.  ఇంకా ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు రూహత్ బేగ్, ఉపేందర్ నాయుడు, రవిరాజ్ లను కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందన్నారు. ఈ  కేసులో నిందితులను పట్టుకుని విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రవీణ్ తో పాటు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తూ సమాజంలో తిరుగుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ విధంగా ఉద్యోగాల పేరుతొ మోసం చేసే వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని  ఎస్పీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *