కరీంనగర్తెలంగాణ

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆర్ఏఎఫ్ సేవలు

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆర్ఏఎఫ్ సేవలు

-ఫ్లాగ్ మార్చ్ లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి

కరీంనగర్, శోధన న్యూస్: శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆర్ఏఎఫ్ సేవలు వినియోగించనున్నామని
కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. ఫెమిలైజేషన్ ఎక్ససైజ్ లో భాగంగా కరీంనగర్ కు విచ్చేసిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో శుక్రవారం కరీంనగర్ టౌన్ డివిజన్ లోని గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా గుర్తించిన పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఆర్ ఏ ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ గీతాభవన్ నుండి గోదాం గడ్డ , కాశ్మీర్ గడ్డ రైతు బజార్ వరకు, తరువాత కిసాన్ నగర్ , హుస్సేనిపుర ప్రాంతాల్లో కొనసాగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సేవలు అందించనున్నట్లు పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అడిషనల్ కమాండెంట్ బిస్వ రంజన్ సాహు అడిషనల్ డీసీపీ సి రాజు, ఏసీపీ నరేందర్, ఆర్ఏఎఫ్ ఇన్స్పెక్టర్ లు రవీంద్ర రోషన్, లలితగోప్ నారాయణ్, ఇన్స్పెక్టర్ లు వెంకటేష్ , శ్రీనివాస్ , సురేష్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *