ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు సర్వం సిద్దం చేశామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించా మన్నారు . రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉందన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామని… చెప్పిన దాని కంటే ముందే రుణ మాఫీ చేస్తున్నామన్నారు. రుణమా ఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. అన్నమాట నిలబెట్టుకోవాలని ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలా మంది అన్నారు. చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమేనని నిరూపించామన్నారు. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారన్నారు. రాహుల్ గాంధీ చెబితే చట్టమే అని, సోనియా గాంధీ కుటుంబం గౌరవం కాపాడాలని, దేశానికి ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదని పేర్కొన్నారన్నారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని, రైతులకు రుణమాఫీ చేయడం నా జీవితంలో మర్చిపోలేనిదన్నారు. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ అవుతాయన్నారు. ఆగస్టు 15 లోపల మరో లక్ష వేస్తాం అన్నారు. విజయ్ మాల్యా, నీరవ్, మోదీ లాంటి వాళ్ళు వేల కోట్ల అప్పులు ఉన్నా చావరు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే 2 లక్షల రుణమాఫీ అని తెలిపారు. రుణమాఫీపై గ్రామ, మండ ల, నియోజకవర్గ స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. రేపు రైతుబంధు గురించి 20 సంవత్సరాలు చెప్పుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.