ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్
భద్రాద్రి కొత్తగూడెం, మే, శోధన న్యూస్ :
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం లక్ష్మీదేవి పల్లి మండలం అని శెట్టిపల్లి మరియు పాల్వంచ మండలం రెడ్డిగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌరసరఫర శాఖ అధికారుల తో కలిసి సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. త్రాగునీరు టెంట్, తూకపు, తేమ యంత్రాలు, గన్ని బ్యాగ్స్, టార్పాలిన్ లు, అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యం కేటాయించిన మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, అన్ని రకాల రిజిస్టర్ లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.