తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన  న్యాయమూర్తి 

బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన  న్యాయమూర్తి  

 పాల్వంచ, శోధన న్యూస్ :  పాల్వంచ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల బాలుర వసతి గృహాన్ని  కొత్తగూడెం  జిల్లా న్యాయ సేవాధీకార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి  జి భానుమతి శుక్రవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా  విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్బంగ వసతి గృహం తరగతి గదులు, కిచెన్ రూం, స్టోర్ రూమ్ లను న్యాయమూర్తి పరిశీలించారు. పారిశుధ్యం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. సౌచాలయాలు, వసతి గృహ ఆవరణం శుభ్రంగా లేకపోవడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *