మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కై డోర్ టూ డోర్ ప్రచారం
మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కై డోర్ టూ డోర్ ప్రచారం
అశ్వారావుపేట, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం అశ్వారావుపేట గ్రామంలో స్థానిక మంగళ బజార్,దూదేకుల బజార్, మెరిల బజార్, గాంధీ బొమ్మ సెంటర్,నందు అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, సీఎం కెసిఆర్ గెలుపు కొరకు టౌన్ పార్టి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బిఆర్ఎస్ మేనిఫెస్టో ను వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ప్రతీ గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ ఓట్లు అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా అధికార ప్రతినిధి us ప్రకాష్ రావు,అశ్వారావుపేట పట్టణ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంకా ప్రసాద్, మండల నాయకులు తాడేపల్లి రవి,తాళం సూరి, లింగిసెట్టీ వెంకటేశ్వరరావు, లింగంకుంట.కృష్ణా సోమని రమేష్, కిరణ్, త్రినాథ్, శివ, నక్కా.రాంబాబు, వెంకటేశ్వర రావు, ఎండి హుస్సేన్, వెంకటేష్, శివ, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-సాయి బాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు:
ములకలపల్లి మండల కేంద్రంలో సాయి బాబా దేవాలయంలో అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు భారీ మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములకలపల్లి గ్రామ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బిక్కుమల్ల సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సున్నం బాబురావు, బీబినేని హరీష్ , మోట రవి, ఐతంరాజు నాగేశ్వరరావు , కాంపటి సొందు , నల్లబెల్లి వెంకటేశ్వర్లు , శ్రీను తదితరులు పాల్గొన్నారు.