సీఎం రేవంత్ రెడ్డి తో ఆర్ బీ ఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ భేటి
సీఎం రేవంత్ రెడ్డి తో ఆర్ బీ ఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ బేటీ
హైదరాబాద్, శోధన న్యూస్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో ఆర్బీఐ మాజీ గవర్నర్ శ్రీ రఘురామరాజన్ ఆదివారం జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో ప్రత్యేక సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసన వ్యవహారాలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.