జాతీయఢిల్లీ

ఎంపీ రాహుల్ గాంధీని సన్మానించిన తెలంగాణ మంత్రి సీతక్క

ఎంపీ రాహుల్ గాంధీని సన్మానించిన తెలంగాణ మంత్రి సీతక్క

ఢిల్లీ, శోధన న్యూస్ : ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ని తెలంగాణ  రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క  శాలువా తో సన్మానించారు.  దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ల ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి  సీతక్క  ఎంపీ  రాహుల్ గాంధీ ని కలిసి శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క  మాట్లాడుతూ ఈ దేశ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకై పేద ప్రజల పక్షాన పార్లమెంట్ లో తన గొంతును వినిపించి ప్రజలకు అండ దండగా రాహుల్ గాంధీ  ఉంటారని అన్నారు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు రాహుల్ గాంధీకి తోడుగా దేశ ప్రజలు కూడా ఉంటారని మంత్రి సీతక్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *